79 మంది హోంగార్డులు
63 మంది సివిల్ 07 మంది ఎంప్టీ సెక్షన్ ఏఆర్ కానిస్టేబుల్స్
20 మంది సివిల్ హెడ్ కానిస్టేబుల్స్
23 మంది అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ల (ఏఎస్సైలు) లకు కౌన్సిలింగ్ ద్వారా బదిలి ప్రక్రియ నిర్వహించిన జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
నవతెలంగాణ – కామారెడ్డి
గత 4 – 5 రోజులుగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్ వాడ సబ్ డివిజినల్ పరిధిలోని హోంగార్డు నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు బదిలీల ప్రక్రియను వ్యక్తిగతంగా అధికారులతో కౌన్సిలింగ్ ద్వారా, విల్లింగ్ స్టేషన్లు, స్పౌస్ ప్రిఫరెన్స్, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, సేవా రికార్డుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో ముగించినట్టు జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారదర్శక బదిలీలతో పాటు ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలనీ, ప్రజల మధ్య ఎల్లప్పుడూ విజిబుల్ పోలీస్ గా ఉండేలా శ్రమించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే శాఖపరమైన చర్యలు తప్పవు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కొత్త స్థానాల్లో ప్రతి ఒక్కరు నూతన ఉత్సాహంతో, న్యాయసమ్మతంగా, ప్రజల పట్ల బాధ్యతతో విధుల్లో నిమగ్నం కావాలి అని అన్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ జారీ చేయడం జరిగిందన్నారు.
పారదర్శక బదిలీలు.. బాధ్యతాయుత విధులకు పునాది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES