- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి తుర్కియే ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 విమానం మెయింటెనెన్స్ను తమ దేశానికి సంబంధించిన సంస్థ చూసిందని వస్తున్న వార్తలను ఖండించింది. ఎయిరిండియా, తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-25కి గాను ఒప్పందం జరిగిందని పేర్కొంది. అందులో బీ777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. ఈ రకం విమానానికి మెయింటెనెన్స్ చేయలేదని తెలిపింది.
- Advertisement -