Monday, June 16, 2025
E-PAPER
Homeదర్వాజఇది గాయాలను మాన్పే కవిత్వం

ఇది గాయాలను మాన్పే కవిత్వం

- Advertisement -

కవులందరూ కవిత్వం రాయగలరు. కొందరు మాత్రమే గాయాలకు మందు పూయగలరు. బాధాతప్త హదయాలకు సాంత్వన నివ్వగలరు. అనిర్వచనీయమైన అనుభూతికి గురిచేసి భారహదయాలను తేలిక పరచగలరు. ఆ అమత వాక్యాలు చదువుతున్నంతసేపు… మనం అనుభూతి కొలనులో హాయి మునకలేస్తున్నంతసేపు… అలాంటి మహత్తర కవిసమయాలను సమకూర్చగల అద్భుతకవి ఆశారాజు.
కవిత్వం ఒక హాయి సాంత్వన, గాయం మానిపే ఔషధం.. బాధలు మరిపించే నిషా.. గమ్మత్తు కైపు.. ”మై షాయర్‌ నహీ మగర్‌ ఏ షాయరీ” ఈ పాట వినని వాళ్ళు ఉండరు. అలాగే షాయర్‌ రాజా కవిత్వాన్ని చదవని వారు ఉండకపోవచ్చు. శ్రీశ్రీని చదివినవాడు శివారెడ్డి కవిత్వాన్ని చదివి ప్రేరణ పొందినవాడు ఇప్పుడు మనలో మానసిక సంఘర్షణ తగ్గించడానికి కారణం అవుతున్నాడు. ఈయనకు కవిత్వం ఒక మత్తు. ఆ మత్తుని మనకు ఎక్కిస్తారు ఈయనకు కవిత్వం ఒక ఎత్తు. ఆ ఎత్తుని మనల్ని ఎక్కేలా చేస్తాడు.
ఎదో ఒక్క కవిత అయితే ఉటంకించగలం.. ఒక్క పుస్తకం అయితే ఉదహరిస్తాం. ప్రతి కవితలో ప్రతి పుస్తకంలో ఇంతేసి కవిత్వాన్ని మన ముందు ఉంచి మనల్ని ఆ కవిత్వ మత్తులో ఊపిరాడనికుండా చేస్తే ఏమవ్వాలి? ఎంత జుర్రుకున్నా ఇంకా మిగిలే ఉన్న తేనేతుట్టె ఆయన అక్షరాలు. వయస్సు తన కవితా తపస్సుకు అవరోధం కాలేదు. ఈయన వయసు అక్షరాల 61. ఈయన చేసిన రచనలు 22, అనువాదాలు ముచ్చటగా 3. ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు నుండి మొన్నటి 2024లో సాహిత్య సంస్థ హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్‌ ఖమ్మం తరపున ఇచ్చిన సాహిత్య పురస్కారంతో కలిపి బోలెడు అవార్డులు.
‘ఆశారాజు’… కవిత్వంలో ఈ పేరు మోగని కవిత్వ పాదం ఉండదు. వయసుకు మనసుకు సంబంధం లేదు. కవిత్వాన్ని రాయడం మనుషుల్ని ప్రేమించడం ఒకటే అంటాడేమిటి ఈ నిగర్వి. అందుకే ఆయన ప్రతి కవిత్వం ప్రేమతో తీయగా గుండెకు హత్తుకుంటుందేమో! అయితే ఈ విశ్లేషణకు మొదటి కారణం 2025 మార్చిలో విడుదల అయిన ”ఒక దినం ప్రతి దినం” పుస్తకం. 153 కవితల్లో మనసుని చల్లపరిచే ఎన్నో వాక్యాలు.
”వెన్నెల్లో నిల్చుంటే/ కళ్ళకి చల్లదనం ఉంటుంది/ గాయానికి కాదు” వెన్నెల మానసికానుభూతి కానీ భౌతికపరమైన ఓదార్పుకాదు. ఈవాక్యం చూసేందుకు ఇలా ఉన్నా.. కవి అర్థం అనంతం. గాయపడినవాడికి, బాధితుడికి ఓదార్పు మాటలు చాలవు. సాంత్వన కలిగించే మందుపూయాలి అని.
”మీరు నన్ను ఇష్టపడకపోవచ్చు/ ఏ దానికీ పట్టించుకోకపోవచ్చు/ వస్తూ పోతూ రెండు రాళ్ళేయొచ్చు/ కానీ నావైపు చూడకుండా ముందుకు వెళ్ళలేరు”. ద్వేషించటంలో ప్రేమించటం అనే ప్రాపంచిక సూత్రం ఈవాక్యాలో కనిపిస్తుంది. శత్రువే అయినా తన కదలికల్ని కనిపెట్టటం ఎంతో అవసరం.. ఈ జాగురుకత, మెలకువ స్పహ అవసరమన్న సందేశం.
”నాకు పక్షులంటే ఎనలేని ప్రేమ/ అలాగని వాటిని పట్టుకోవడానికి పంజరంతో తిరుగుతానని కాదు” ప్రకతి ప్రేమికుని బహిరంగ ప్రకటన ఇది. స్వేచ్ఛా ప్రపంచాన్ని కళ్లతో ఆస్వాదించాలన్న హితోక్తి ఇది.
”చిన్నగా మాట్లాడు/ కిటికీలో గాలి ఎక్కువగా వీస్తుంది/ నీవు చెప్పే గాయాల రహస్యం మోసుకుపోతే/ నీవు ఇక్కడ తలదాచుకున్న సంగతి నగరమంతా తెలుస్తుంది”. నాకు అమితంగా నచ్చిన వాక్యాల్లో ఇవీ ఉన్నారు. ఉద్యమకారుడితో తన స్నేహితురాలి రహస్య సంభాషణేమో ఇది అన్నంత సహజంగా ఉంది. నాకైతే ఆపరేషన్‌ కగార్‌ సందర్భంలో కళ్ళముందు ఓ సంక్లిష్ట దశ్యం కదలాడింది.
”యుద్దాలు జరిగిన తరువాత/ అతడు కవిత్వం మానేసి/ మనుషుల్ని ప్రేమించడం ముఖ్యమన్నాడు” యుద్ధం విజయాన్నో, అపజయాన్నో కాదు పశ్చాత్తాపాన్ని, పరివర్తనను కలిగిస్తుంది. అశోకుడి నుంచి నిన్నటి సింధూర్‌ వరకు ఇదే నిరూపితమయింది.
”మనుషులు కలుసుకోని రోజు/ నగరంలో కర్ఫ్యూ ఉందేమో అని/ చిన్నగా భయం వేస్తుంది” మనుషులు కలవటమే మహౌన్నతం.. సెక్యులర్‌ రాజ్యంలో అన్ని అడ్దుగోడలూ కూలిపోవాలి, ఒకరిమొఖం ఒకరికి కనిపించాలి ఒకరిగొంతుతో మరొక స్వరం సమ్మిళితమవ్వాలి.
”రాత్‌ కట్‌ తీ నహీ, దిన్‌ గుజర్‌ తా నహీ/ జక్మ్‌ ఐసా దియా కే భర్‌ తా నహీ!” వV్‌ా..సాబ్‌ వV్‌ా.. క్యాబాత్‌ హై.
”గాయాలకైతే కట్లు కడతారు/ జ్ఞాపకాలకు ఏ లేపనం రాస్తారు”. అవును జ్ఞాపకాలూ గుచ్చుకునే ముళ్లు… ఇలాంటి అనుభూతి వాక్యాలే మిగతావన్నీ…
ఇక్కడ శీర్షిక లేదా కవిత అనేది అసందర్భం. ఎంత అనుభవంతో రాసిన మాటలో ప్రతిదీ. రాత్రుళ్లు సరిగా నిద్రపట్టక జ్ఞాపకాల గాయాల్లో నలిగిపోతున్న ప్రతి వ్యక్తికి ఈ కవిత్వం అవసరం.
అది కథలాగో, నవలలాగో కాకుండా కవిత్వంలా మీకు కనపడినా అందులో ఎన్ని ఉపమానాలు ఉన్నాయో, మరెన్ని అనుభవాలు ఎదురౌతాయో… ఒక్కొక్క వాక్యం ఒక్కో వజ్రం. వజ్రాన్ని సానపెట్టడం అంటే ఇక్కడ మన జీవిత సందర్భాలకు ఆపాదించుకోవడమే.
ఎంత తత్వం, ఎంత మానసికం, మరెంత ఆధునికం ప్రతి వాక్యం. ఏ పేజీ తీసి చదివినా చాలు అందులోని నాలుగు వాక్యాలు చల్లని సాయంత్రం పూట టీ తాగుతూ ప్రకతిని ఆస్వాదిస్తున్న తీరు ఉంటాయి.
కొన్నిసార్లు నొప్పి కూడా తియ్యగానే ఉంటుంది. ఇదిగో ఈ షాయర్‌ కవిత్వంలా. వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడి తలపులా, బడిలో బలపం పలక పట్టుకొని నేర్చుకునే విద్యార్థిలా ఉంటాయి ఈయన మాటలు.
అమ్మో గుండె కొట్టుకోవడం మొదౌలుతుంది మరొక్కసారి. మీరు ఆ చప్పుడుని వినాలి అనుకుంటే ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదవండి. ”నిదరే రాదు రాత్రంతా కలలు నేసే నాకు వినగలవంటే తమాషాగా ఒకటి చెప్పనా”, ”ప్రతిదినం నీ అర్చనం ఇక జరుపనా జరపనా”.. అచ్చం ఈ పాటలానే అద్భుతమైన మెలోడీ ఈ పుస్తకం కూడా చదువుతారు కదూ.

– సుభాషిణి తోట, 9502818774

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -