Wednesday, June 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ముగ్గురు మార్నింగ్ వాక‌ర్స్ మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ముగ్గురు మార్నింగ్ వాక‌ర్స్ మృతి

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మార్నింగ్ వాకింగ్ వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తుల‌ను ఓ వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బాధితులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..బుధ‌వారం తెల్ల‌వారుజామున మామిడికాయ‌ల లోడ్‌తో వెళ్తున్న ఓ వాహ‌నం..అతివేగంతో అదుపు త‌ప్పి.. ఆగ్రాలోని ట్రాన్స్ యమునా ప్రాంతం కింద షాహ్దారా చుంగి ఫ్లైఓవర్ పై మార్నింగ్ వాకింగ్ కోసం వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్త‌లను ఢీకొట్టింద‌ని, ఆ త‌ర్వాత వాహ‌నం బోల్తా ప‌డింద‌న్నారు. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వాక‌ర్స్‌తో పాటు డ్రైవ‌ర్ కూడా చ‌నిపోయాడ‌ని అధికారులు తెలిపారు. వాహ‌నం హెల్ఫ్‌ర్‌కు తీవ్ర‌గాయాలు కాగా చికిత్స్ కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -