నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాకింగ్ వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం తెల్లవారుజామున మామిడికాయల లోడ్తో వెళ్తున్న ఓ వాహనం..అతివేగంతో అదుపు తప్పి.. ఆగ్రాలోని ట్రాన్స్ యమునా ప్రాంతం కింద షాహ్దారా చుంగి ఫ్లైఓవర్ పై మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తలను ఢీకొట్టిందని, ఆ తర్వాత వాహనం బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వాకర్స్తో పాటు డ్రైవర్ కూడా చనిపోయాడని అధికారులు తెలిపారు. వాహనం హెల్ఫ్ర్కు తీవ్రగాయాలు కాగా చికిత్స్ కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మార్నింగ్ వాకర్స్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES