- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) నేడు దిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలువనున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ ఛైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్రెడ్డి చర్చించే అవకాశముంది.అంతేకాకుండా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్, ఇతర అధికారులను సీఎం కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వారితో చర్చించనున్నట్లు సమాచారం.
- Advertisement -