- Advertisement -
- మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు
నవతెలంగాణ-కంటేశ్వర్: ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పశువులను సంరక్షించుకోవాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ బాబురావు అన్నారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్, గూపనపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఉచిత గొంతు వాపు, జబ్బ వాపు నివారణ టీకాలు వేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా గేదెలు 1327 ఆవులకు 98 టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విఎల్ ఓ.రమేష్,ఎల్ఎస్ ఏ.డి శ్రీనివాస్,వి.ఏ నరేష్, జావిద్, అష్రఫ్, గంగారం, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -