Thursday, June 19, 2025
E-PAPER
Homeబీజినెస్ఆభరణాల ఎగుమతుల్లో 16 శాతం పతనం

ఆభరణాల ఎగుమతుల్లో 16 శాతం పతనం

- Advertisement -

న్యూఢిల్లీ: ఈ ఏడాది మేలో భారత రత్నాలు, అభరణాల ఎగుమతుల్లో 15.81 శాతం పతనం చోటు చేసుకుందని జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) వెల్లడించింది. గత నెలలో ఈ రంగం ఎగుమతులు రూ.19,260.81 కోట్లకు తగ్గాయి. 2024 ఇదే నెలలో రూ.22,414.02 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు రూ.16,184 కోట్లుగా ఉండగా.. గడిచిన మేలో 12.96 శాతం తగ్గుదలతో రూ.14,393 కోట్లుగా చోటు చేసుకున్నాయి. అమెరికా హెచ్చు టారిఫ్‌లకు తోడు గ్లోబల్‌ అనిశ్చితితో ఎగుమతులో తగ్గుదల చోటు చేసుకుందని జీజేఈపీసీ వర్గాలు పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో మొత్తం భారత సరుకుల ఎగుమతులు 2.17 శాతం పతనమై 38.73 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో 39.59 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన మేలో దేశ దిగుమతులు 1.7 శాతం తగ్గి 60.61 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు తక్కువగా ఉండి.. దిగుమతులు ఎక్కువగా ఉండటంతో వాణిజ్యలోటు 21.88 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకుంది. ప్రస్తుత ఇరాన్‌- ఇజ్రాయిల్‌ ఉద్రిక్తతలు భారత ఎగుమతులపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన మే నెలలో బియ్యం, ముడి ఇనుప ఖనిజం, రత్నాలు, అభరణాలు, ఇంజనీరింగ్‌, టెక్స్‌టైల్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధి చోటు చేసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 30.32 శాతం క్షీణించి 5.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో స్థూల భారత ఎగుమతులు స్వల్పంగా 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు దిగుమతులు 6.62 శాతం పెరిగి రూ.720.24 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -