- Advertisement -
న్యూఢిల్లీ:ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను రూ. 2,397 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేసింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్ ప్రతి షేరుకు రూ. 4.2 చొప్పున డివిడెండ్ను ప్రకటించింది. బ్యాంక్ నమోదు చేసిన బలమైన ఆర్థిక పనితీరు, వాటాదారులకు దీర్ఘకాలిక విలువను అందించడంలో ఉన్న నిబద్ధతకు ఈ డివిడెండ్ చెల్లింపు నిదర్శనమని కెనరా బ్యాంక్ ఎండి, సిఇఒ బ్రజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
- Advertisement -


