– విద్యాశాఖ సంచాలకులకు టీఎస్ఎంఎస్టీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ను గురువారం హైదరాబాద్లో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవితోపాటు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి కొండయ్య, ప్రధాన కార్యదర్శి సిల్వేరు మహేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో మార్చి 15న విడుదల చేసిన జీవో నెంబర్ 23 అమలు చేస్తున్న విధంగానే తెలంగాణలో మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో చేర్చి 010 పద్దు కింద వేతనాలను చెల్లించాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018కి అనుగుణంగా పోస్టులను లోకల్ క్యాడర్కు రీఆర్గనైజ్ చేసి అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరణించిన 40 మంది మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలను కల్పించి వారికి ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా ఇవ్వాలని సూచించారు. డీఏ బకాయిలను చెల్లించాలని కోరారు.
మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES