Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మె సైరన్‌

విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మె సైరన్‌

- Advertisement -

– యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చిన జేఏసీ నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో సమ్మె సైరన్‌ మోగింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టిజన్‌ కార్మికులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా ఆర్టిజన్‌ కార్మికులకు అర్హతను బట్టి కన్వర్షన్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను చాలా కాలంగా ప్రభుత్వం, యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్తున్నా, ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. దీనితో ఇక సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌ జేఏసీ (టీబీఏసీ-జేఏసీ) చైర్మెన్‌ కే ఈశ్వరరావు నేతృత్వంలో గురువారం విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇచ్చారు. కేవలం రెండే ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మెనోటీసులు ఇచ్చారు. ఆర్టిజన్ల కన్వర్షన్‌, ఎగ్జిస్టింగ్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలనే డిమాండ్లను నోటీసుల్లో పొందుపర్చారు. టీజీఎస్‌ జెన్‌కో సీఎమ్‌డీ ఎస్‌ హరీశ్‌, టీజీఎస్‌ ట్రాన్స్‌కో కోజేఎమ్‌డీ (ఎఫ్‌ఏసీ) సూర్యప్రకాశ్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫారూఖీకి సమ్మెనోటీసులు ఇచ్చారు. జేఏసీ కన్వీనర్‌ ఏమ్‌ఏ వజీర్‌, కో చైర్మెన్లు గాంబో నాగరాజు, బీ నరేందర్‌, కో కన్వీనర్‌ కందికొండ వెంకటేష్‌, జాయింట్‌ సెక్రటరీలు ఎస్‌ చంద్రారెడ్డి, కే లింగం, పీ మురళీ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు పీ కోటి, సలీంపాషా, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -