- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం లగేజీ రవాణా నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా క్రీడాకారులు తమ పెద్ద క్రీడా పరికరాలను (జావెలిన్లు వంటివి) నిర్దేశిత ఛార్జీలు చెల్లించి, లగేజీ కంపార్ట్మెంట్లో సులభంగా తరలించుకోవచ్చు. వీటికి సాధారణ బరువు పరిమితి వర్తించదు. అయితే పోల్-వాల్ట్ పోల్స్పై నిషేధం కొనసాగుతుంది. ప్రమాదకరమైన, మండే స్వభావం గల వస్తువులను తీసుకెళ్లడంపై కఠిన ఆంక్షలు, ఉల్లంఘిస్తే జరిమానా, చట్టపరమైన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
- Advertisement -



