No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంముమ్మ‌రంగా మృత‌దేహాల గుర్తింపు

ముమ్మ‌రంగా మృత‌దేహాల గుర్తింపు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీల కోసం చేప‌ట్టిన డీఎన్ఏ ప‌రీక్ష‌లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. 220 మందిని డిఎన్‌ఎ టెస్టుల ద్వారా గుర్తించామ‌ని వీరిలో 202 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామ‌ని అధికారులు శుక్ర‌వారం వెల్లడించారు. ఈ నెల 12న 242 మంది ప్రయాణీకులతో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా 171 విమానం టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఒక్కరు మినహా విమానంలో ఉన్న అందరూ మరణించారు. మృతుల గుర్తింపును నిర్ధారించడానికి డిఎన్‌ఎ పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు. విమాన ప్రమాదం కారణంగా మృతదేహాలు కాలిపోవడం, గుర్తించలేని విధంగా తీవ్రంగా దెబ్బతినడంతో మరణించిన వారిని గుర్తించడానికి డిఎన్‌ఎ పరీక్షలు తప్ప మరో మార్గం లేదని అధికారులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad