నవతెలంగాణ-హైదరాబాద్: సర్కార్ కొలువు సాధించిన సంబరం కూడా లేకుండా కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను యోగీ ప్రభుత్వం హడలెత్తిస్తుంది. డిపార్ట్మెంట్ నియమాలను ఉల్లంఘించే వివాదాస్పద పోస్టులను సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చిన, వాటిని పలువురికి షేర్ చేసిన శాఖపరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరుకు శుక్రవారం ఓ ప్రటకన జారీ చేసింది. ట్రైనింగ్లో భాగంగా పోలీస్ నియమాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సోషల్ మీడియాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసులు కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉంటారని, ఈక్రమంలో పలు జాగ్రత్తలు పాటించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ట్రైనింగ్లో భాగంగా కొత్త పీసీలకు కూడా సోషల్ మీడియా గైడ్ లైన్స్ను అనుసరించాలన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం కొత్తగా ఎంపికైన 60,244 మంది పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు.త్వరలోనే వారందరికి పోలీస్ ట్రైనింగ్ ప్రారంభకానుంది.
యూపీ కొత్త కానిస్టేబుళ్లకు యోగి సర్కార్ ఝలక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES