- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక : విభిన్న ప్రతిభావంతుల ( ప్రత్యేక అవసరాలు కలిగిన ) చిన్నారులకు ఆటపాటలతో చదువులు చెప్పడం జరుగుతుందని ఎంఈఓ జే.ప్రభుదాస్ అన్నారు. మిగతా పిల్లల వలె వారి విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. దుబ్బాకలోని భవిత కేంద్రానికి రూ.2 లక్షల విలువైన ఆల్ఫాబెట్స్, నంబర్స్, ఫిజియో మెటీరియల్ అందగా.. శుక్రవారం వీటితో విభిన్న ప్రతిభావంతులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధించడం జరిగింది. ఐఈఆర్ పీ లు ఎస్.రమ, యాదగిరి, ఎంఆర్ సీ సిబ్బంది పలువురున్నారు.
- Advertisement -