- Advertisement -
నవతెలంగాణ – హైదారాబాద్: నెల్లూరు జిల్లా కోవూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహబూబ్ బాషా, రేష్మ దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు రషిషా(5) ఇంటివద్ద మెట్ల పక్కన మరుగుదొడ్డిపై ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా .. ఒక్కసారిగా జారి పడింది. అయితే చిన్నారి తలలో చాకు దిగబడడంతో తీవ్ర రక్తస్రావమైంది. కొన ఊపిరితో ఉండగా వైద్యం కోసం చిన్నారిని నెల్లూరు, తిరుపతికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విడిచింది. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
- Advertisement -