ఎన్‌ఎంఎం స్కాలర్‌ షిప్‌కు ఆరుగురు కొండకల్‌ విద్యార్థుల ఎంపిక

నవతెలంగాణ-శంకర్‌పల్లి
ఎన్‌ఎంఎం స్కాలర్షిప్‌కు కొండకల్‌ పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైనట్టు కొండకల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీవనజ్యోతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించే ఎన్‌ఎంఎంఎస్‌ (నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్షిప్‌) టెస్ట్‌ గత విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన పరీక్షా ఫలితాలు నిన్న రాత్రి విడుదలైనట్టు తెలిపారు. అందులో శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇంతకుముందు ఎంపికైన ఆరుగురు విద్యార్థులను శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలతో పాటు ఉపా ధ్యాయులందరూ కలిసి విద్యార్థులను అభినం దించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండకల్‌ పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఆరుగురు విద్యార్థులు ఎంపిక య్యారన్నారు. ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ప్రతీ ఏడాది ప్రభుత్వం నుంచి రూ. 12 వేల స్కాలర్షిప్‌ ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకు వస్తుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు లోహిత్‌ కుమార్‌, మన్నే శృతి గండ్ర శిరీష, ఎరుకల దీపిక, ఎరుకల దీక్షిత, రేపాని సుమలతలు ఎంపికయ్యారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రఘునందన్‌ రెడ్డి, అంజిరెడ్డి, రామ కృష్ణారావు, కుసుమకుమారి, సుజాత, జంగయ్య, రాములు, వెంకటేశం, రాధ, హరికృష్ణ, యాదయ్య, అరుంధతి విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.

Spread the love