Wednesday, June 25, 2025
E-PAPER
HomeNewsఇజ్రాయిల్‌లోని బిర్షెబాపై ఇరాన్ దాడి

ఇజ్రాయిల్‌లోని బిర్షెబాపై ఇరాన్ దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్‌ ఇజ్రాయిల్‌లోని బిర్షెబాలోని నివాస భవనంపై క్షిపణులతో దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఆ భవనంలో నలుగురు నివాసితులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఇజ్రాయిల్‌ మీడియా పేర్కొంది. ఇరాన్‌- ఇజ్రాయిల్‌ మధ్య గత కొన్నిరోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అయితే ఈ ట్రంప్‌ ప్రకటించిన కొన్ని గంటల తర్వాతే ఇరాన్‌ ఇజ్రాయిల్‌పై క్షిపణి దాడికి పాల్పడడం గమనార్హం. ఇరాన్‌ ఆరుసార్లు క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయిల్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -