డీసెట్‌ దరఖాస్తు గడువు 30

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో 2024-26 బ్యాచ్‌ ప్రవేశాల కోసం డీసెట్‌-2024 దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వాటి సమర్పణకు ఈనెల 30 వరకు గడువుందని డీసెట్‌ కన్వీనర్‌ ఎస్‌ శ్రీనివాసాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం మార్కులు వచ్చిన వారే దరఖాస్తు చేసేందుకు అర్హులనీ, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు 45 శాతం మార్కులొచ్చినా దరఖాస్తు చేయొచ్చని సూచించారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలని వివరించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో డీసెట్‌ రాతపరీక్షలను వచ్చేనెల పదో తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల 20,30 తేదీల్లో ఇప్పటి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సవరణకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇతర వివరాలకుష్ట్ర్‌్‌జూ://సవవషవ్‌.షసరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

Spread the love