– ఒకటో తరగతిలో 1.07 లక్షల మందికి ప్రవేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరంలో 2,56,156 మంది విద్యార్థులు చేరారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకటో తరగతిలో 1,07,126 మంది ప్రవేశం పొందారని వివరిం చారు. రెండు నుంచి పదో తరగతి వరకు ప్రయివేటు పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో 48,133 మంది, ప్రభుత్వ స్కూళ్ల నుంచి సర్కారు పాఠశాలల్లో 1,00,897 మంది చేరారని తెలిపారు. అత్యధికంగా హైదరాబాద్లో 19,555 మంది, ఆ తర్వాత నిజామాబాద్లో 14,807 మంది, వికారాబాద్లో 14,684 మంది, సంగారెడ్డిలో 14,215 మంది ప్రవేశం పొందారని వివరించారు. అత్యల్పంగా హన్మకొండలో 1,386 విద్యార్థులు మాత్రమే చేరారని పేర్కొన్నారు. గత విద్యాసంవత్సరంలో సర్కారు బడుల్లో 2,00,901 మంది ప్రవేశాలు పొందితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు 2,56,156 మంది విద్యార్థులు పొందారని వివరించారు.
సర్కారు బడుల్లో 2.56 లక్షల మంది చేరిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES