- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మైలార్దేవ్పల్లి లక్ష్మి గూడాలో విషాదం చోటు చేసుకుంది. నిన్న బావిలో పడ్డ 5 ఎండ్ల బాలుడి మృతదేహాన్ని 12 గంటలుగా శ్రమించిన సహాయక బృందాలు బయటకు తీశాయి. బావిలో ఉన్న నీటిని తోడి, బుల్డోజర్స్తో బావిని తొవ్వి అధికారులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, నిన్న మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఐదేళ్ల బాలుడు ప్రిన్స్ బావిలో పడ్డాడు. అప్పటి వరకు తమ కళ్లెదుటే ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రిన్స్ మృతితో లక్ష్మిగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -