పద్మశాలీల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

– కాంగ్రెస్ లో చేరిన పద్మశాలి నాయకులు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలిల  సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా  చేనేత కార్మికులు చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజుల భగవాన్ నేత ,పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొలి వెంకట నారాయణ , పాము రాజన్న ,మార్కండేయ స్వామి ఆలయ బాద్యులు వేముల వెంకట రమణ, జనగామ గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు  సాదుల యాదగిరి, వేముల వీరాస్వామి ,గాదాసు రాజు ,వివిధ గ్రామాల పద్మశాలి సంఘం అధ్యక్షులు పద్మశాలి సంఘాల నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బలహీన వర్గాల శాఖ మంత్రి గా పద్మశాలి వర్గాల సమస్యలను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమస్యలను పరిష్కరిస్తానన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జౌళి శాఖ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలం అని వారితో మాట్లాడడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షుడు బంక చందు, కెడం లింగమూర్తి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love