- Advertisement -
– ధర రూ.3 కోట్లు
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడజ్ బెంజ్ కొత్తగా ఎఎంజి జీటీ 63, జిటి 63 ప్రోను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధరలను రూ.3 కోట్లుగా నిర్ణయించింది. ఎవరైతే వేగం, స్టైల్, పనితీరును ప్రేమిస్తారో వారి కోసం ఈ మోడళ్లను ఆవిష్కరించామని మెర్సిడజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. కేవలం 3.2 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని.. గంటకు 315 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం వీటి సొంతమన్నారు.
- Advertisement -