నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మూసివేసిన తమ గగనతలాన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల మీదుగా విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఆ దేశ రోడ్లు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు సాగిన వైమానిక ఘర్షణల అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.
పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. అమెరికా అండతో నెతాన్యాహు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఆ దేశ అణు స్థావరాలపై దాడులు చేశారు. ఆ తర్వాత ఆపరేషన్ ప్రామిస్ ట్రూ పేరుతో ఇరాన్ ఇజ్రాయిల్ సైన్యంపై ప్రతీదాడులకు దిగింది.
రెండు దేశాల తమ గగనతలాన్ని మూసివేశాయి. భారత్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తన గగనతలం గుండా ఇండియన్ పౌరులను తరలించడానికి అంగీకరించింది. రెండు రోజుల తర్వాత అన్యూహంగా అమెరికా ఇరాన్ దేశంపై బాంబుల వర్షం వేసింది. ఆగ్రహించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని..కువైట్, ఖతార్ దేశాల్లో ఉన్న యూఎస్ ఎయిర్ బేస్లపై క్షిపణుల వర్షం కురిపించారు. దీంతో బిత్తరపోయిన ట్రంప్ ..ఖతర్ రాయబారంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో గల్ప్ యుద్ధం ముగిసిపోయింది.