– అదే రోజు గ్రామస్థాయి నేతలతో బహిరంగసభ : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జులై 4న గాంధీభవన్లో జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పీఏసీ సమావేశం అనంతరం పీసీసీ విస్తతస్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతలతో భహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కమిటీ మీటింగ్లో బాగంగా నిర్వహిస్తున్న ఈ సభకు 15 వేల మంది హాజరుకానున్నారని తెలిపారు. వరంగల్ నేతలు వ్యవహారాలలో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. జీవితాంతం లౌకికవాదిగా బతికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఒప్పుకోని డీఎస్ విగ్రహాన్ని బీజేపీ నాయకునితో ఆవిష్కరిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందనీ, అయినా కాంగ్రెస్ నాయకులెవరికీ ఆహ్వానం లేదని తెలిపారు. డీఎస్ ఏనాడు బీజేపీలో లేరనీ, కొన్ని కారణాల వల్ల ఆయన బీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని తెలిపారు. మాజీ మంత్రి, దివగంత నేత ముఖేశ్ గౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొత్తగా నియమించబడిన టీపీసీసీ ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు పని విభజన చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.
జులై 4న పీఏసీ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES