హై రిస్క్ కేసులలో దిట్ట డాక్టర్ హరికృష్ణ
వర్షాకాలంలో చిన్న పిల్లలు జాగ్రత్త
శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ వైద్యులు ఎంబిబిఎస్, డి సి హెచ్ (నిలోఫర్) పిల్లల వైద్య నిపుణులు హరికృష్ణ
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 15 సంవత్సరాలకు పైగా శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరికృష్ణ జిల్లా ప్రజలతో పాటు ఇతర జిల్లాల ప్రజలకు సైతం ఉన్నతమైన ప్రమాణాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నపిల్లలలో హై రిస్క్ కేసులను తీసుకొని విజయంగా పూర్తి చేస్తూ ఓ మంచి పేరు సంపాదించుకున్నరు. తమ ఆస్పత్రిలో నవజాత శిశువులకు అత్యాధునిక ఎస్ఐసీయూ, పీఐసీయూ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. అత్యధిక సామర్థ్యం ఉన్న ఓసిలేటర్ ఫొటో థెరఫీ కూడా అందుబాటులో ఉందన్నారు. సెంట్రల్ ఆక్సిజన్, 24 గంటల లేబరేటరీ, అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంచామన్నారు.నెల తక్కువ, బరువు తక్కువగా పుట్టిన నవజాత శిశువులకు చికిత్స కోసం ఇప్పుడు హైదరాబాద్ కు వెళ్ళవలసిన అవసరం లేదు.
నిజామాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా హెచ్ ఎఫ్ వో వెంటిలేటర్ వెంటిలేటరీ సిపిఎపి, ఏ బి జి, బిల్లీ చెక్ 24 గం|| చిన్న పిల్లల స్పెషలిస్టులచే వైద్యం చేయబడు 50 పడకల ఏకైక ఆసుపత్రి శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి అని తెలిపారు. ఈ మధ్యకాలంలో సుమారుగా 8 సంవత్సరాల బేబీ ఆఫ్ కవితగా కవిత కి జన్మించిన ఈ పాప 34 వారాల్లో బరువు తక్కువగా జన్మించి ప్రాణాపాయ పరిస్థితిలో ఇతర హాస్పటల్ సిబ్బంది హైదరాబాద్ కు రిఫర్ చెయ్యగా కేవలం నిజామాబాద్ లోని శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రికి అర్థరాత్రి సమయంలో తీసుకురావడం జరిగింది ఇట్టి పాపకు ఐసియూలో వెంటిలేటర్, నూతన చికిత్స విధానంతోచికిత్స అందించి పిదప.. స్వస్థత పొందడం జరిగింది. ఇట్టి ఆనందకరమైన విషయాన్ని బేబీ యొక్క తండ్రి వచ్చి తన ప్రేమను కృతజ్ఞతా భావంతో శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి యాజమాన్యంతో పంచుకున్నారు. ఇలాంటి తల్లిదండ్రుల దీవెనలతో.. మేము ముందు ముందు ఉత్సాహంగా పనిచేయడానికి హైరిస్ కేసెస్ టేక్ అప్ చేయడానికి దోహదపడతాయి.
మీ సేవలో డాక్టర్ జి హరికృష్ణ.
సీజనల్ వ్యాదుల పట్ల చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ వైద్యులు ఎంబిబిఎస్, డి సి హెచ్ (నిలోఫర్) పిల్లల వైద్య నిపుణులు హరికృష్ణ అన్నారు. వర్షాకాల సీజన్లో చిన్నారుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు ఎంతో సుకుమారంగా ఉంటారు కాబట్టి ప్రాణాంతక వ్యాధులు త్వరగా ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా వంటి వ్యాధులు వస్తాయన్నారు. కొన్నిరకాల శ్వాసకోశ వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందన్నారు. కోంత మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, జీర్ణాశయ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చిన్న పిల్లలకు మలేరీయా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ఫ్లూ జ్వరాలు, విరేచనాలు, వాంతులు కూడా వర్షాకాలంలో చిన్నారులలో ప్రధానంగా కనిపిస్తాయి. పిల్లలు ఆడుకోవడంతో సహా అన్ని రకాల పనుల్లో నిమగ్నమై పిల్లలు ఏదిపడితే అది ముట్టుకుంటారని దాని వల్ల వారి చేతుల్లో బ్యాక్టీరియా, వైరస్లతో నిండిపోతాయని అవి సులభంగా దేహంలోకి చేరే ప్రమాదం ఉంటుందని పిల్లలు బయటకి వెళ్లి వచ్చిన ప్రతిసారి కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలన్నారు.
పిల్లలకు ఇచ్చే భోజనంలో అన్నం, రోట్టె లాంటి వాటితో పాటు పండ్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు, నట్స్, మాంసం లాంటివి చేర్చాలని అలాగే పాల ఉత్పత్తులు కూడా క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. ఎల్టీ డైట్ ఇస్తే పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని సూచించారు. వర్షాకాలలో వచ్చే వ్యాధులు ఎక్కువగా నీళ్లవల్లనే వ్యాపిస్తాయని కనుక పిల్లలకు ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు ఇవ్వకుండా బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్న నీటిని ఇవ్వడం శ్రేయస్కరం అన్నారు. ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే క్రీములు, బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుందన్నారు. అలాగే పిల్లలని బయట దొరికే నీరు, జ్యూస్ లాంటి చల్లని పానియాలకు దూరంగా ఉంచాలన్నారు.