– గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్
గణేష్ మండపాల నిర్వాహకులు వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వహకులు ఆన్లైన్ లింక్ ద్వారా విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోని అనుమతి తీసుకోవాలన్నారు.ఆన్లైన్లో అనుమతి తీసుకుంటే భద్రత కల్పించడం సులువు అవుతుందన్నారు.భిన్నత్వంలో ఏకత్వంలో పండగలు జరుపుకోవడం మన సంప్రదాయం. గణేష్ మండపాల నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,నిమజ్జనం తేదీ,ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ https://policeportal.