Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంటీచర్లపై దారుణంగా దాడి చేసిన పేరెంట్స్..వీడియో

టీచర్లపై దారుణంగా దాడి చేసిన పేరెంట్స్..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విద్యార్థులను కొట్టాడని టీచర్లపై పేరెంట్స్ దాడి చేశారు. బీహార్ లోని గయా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే వారిని వారించి చెంపదెబ్బ కొట్టారు టీచర్ రాకేశ్ రంజన్. దింతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు.

ఇంకేముంది స్కూల్ కు వచ్చి కర్రలతో రాకేశ్ ను చితకబాదారు పేరెంట్స్. అడ్డువచ్చిన మరో ఉపాధ్యాయుడిపైనా దాడి చేశారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -