- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కే బషీర్ అన్నారు. బుధవారం సీఐటీయూ అనుబంద సంఘాల ఆధ్వర్యంలో పెద్దవూర మండల కేంద్రం లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బషీర్ మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో కెవిపిఎస్ జిల్లా నాయకులు చిరు నాగార్జున, దోరపల్లి మల్లయ్య, నాయకులు ఊరె ప్రభాకర్, బొడ్డు మల్లేష్, వెంకటయ్య, శ్రీను, వెంకటమ్మ, దుర్గయ్య, ఆశా వర్కర్లు, సీఐటీయూ అనుబంద సంఘాలు పాల్గొన్నారు.
- Advertisement -