- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.4లక్షల కొత్త రేషన్కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 11.30లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపి రేషన్కార్డుల సంఖ్య 94,72,422కి చేరనుంది. మొత్తంగా 3.14కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
- Advertisement -