యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జిల్లాలోని నారాయణపూర్ , చౌటుప్పల్ మండలాలలోనీ గ్రామాల్లో నూతన మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు ఆసక్తి, అర్హులైన ఏజెన్సీలు, అభ్యర్దులు ధరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. చౌటుప్పల్ మండలంలో 4 కేంద్రాలు , జైకేసారం, కొయ్యలగూడెం, చిన్నకొండుర్, తంగడపల్లి తో పాటుగా నారాయణపూర్ మండలంలో మల్లారెడ్డి గూడెం గ్రామ పంచాయతి, గుజ్జ గ్రామంలో మీ సేవ కేంద్రాలను నిర్వహించుటకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలనారు.
మంచి కంప్యూటరు పరిజ్ఞానం, డిగ్రీ, ఆపై చదువులు, వయస్సు 21 సం. రాల నుండి 44 సం. రాల మధ్య వయస్సు గల వారు కేంద్రాలను నిర్వహించుటకు సరైన పెట్టుబడి స్థోమత కలిగి ఉండాలనారు. పోలీస్ వారి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని కోరారు. మీ సేవ కేంద్రాలను నిర్వహించుటకు గాను అభ్యర్దులకు వ్రాత పరీక్ష/మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్దులను ఎంపిక చేయడం జరుగుతుందనీ, నిర్ధిష్టమైన ధరఖాస్తు ఫారాన్ని జిల్లా అధికారిక వెబ్ సైటు https://yadadri.telangana.gov.in/ పొంది , పూర్తి వివరాలతో సంబంధిత ధృవ పత్రాలు ఈ నెల 14 తేదీ నుంచి 19 తేదీలోగా కలెక్టర్ కార్యాలయం నందు “ ఇన్ వార్డ్ అండ్ అవుట్ వార్డ్” సెక్షన్ లో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 9121147135 నంబర్ ను సంప్రదించాలని కోరారు.
నూతన మీసేవ కేంద్రాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES