హైదరాబాద్ : గణిత ఎడ్టెక్ సంస్థ బాన్జు తాజాగా 16.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.140 కోట్లు) నిధులు సమీకరించినట్లు ప్రకటించింది. కొత్త నిధులతో తమ వేదికను భారత్లో విస్తరించడం సహా అమెరికా, బ్రిటన్, మధ్య ఈశాణ్య దేశాలల్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ సంస్థ తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల విద్యార్థులను చేరుకోవడానికి ఈ పెట్టుబడి సహాయం చేస్తుందని భాన్జు వ్యవస్థాపకుడు, సిఇఒ నీలకంఠ భాను తెలిపారు.