రూ.49 కోట్ల రైట్‌ ఇష్యూకు రెమిడియం

ముంబయి : ఫార్మాస్యూటికల్‌ ఇంటర్మీడియెట్స్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ రెమెడియం లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌ ప్రతిపాదిత రైట్‌ ఇష్యూకు బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత వాటాదారుల నుంచి వృద్ధి మూలధనాన్ని సమీకరించడానికి, సంస్థ కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులు మార్గం సుగమం చేయనున్నాయని ఆ సంస్థ పేర్కింది. రైట్‌ ఇష్యూ ద్వారా రూ.49.19 కోట్ల నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించడంతో పాటుగా వాటాదారుల విలువను పెంచడానికి తాము కట్టుబడి ఉన్నామని రెమిడియం లైఫ్‌ కేర్‌ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ ఆదర్శ్‌ ముంజాల్‌ పేర్కొన్నారు.

Spread the love