Sunday, May 4, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఇందిరమ్మ ఇండ్లపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి

ఇందిరమ్మ ఇండ్లపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం పొందాలన్నారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదన్నారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణప్రాంతంలో 500 ఇండ్లు నిర్మించాలని తెలిపారు. ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -