- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్లో బుధవారం ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన గోపికలు, శ్రీకృష్ణుడి వేషధారణలతో పలువురిని ఆకట్టుకున్నాయి. ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
- Advertisement -