- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని మంథని, ఆలూరు మండలం దేగాం గ్రామానికి మధ్యలో ఉన్న లో-లెవెల్ బ్రిడ్జిని మండల అభివృద్ధి అధికారి శివాజీ, తహసిల్దార్ సత్యనారాయణలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా లో లెవెల్ బ్రిడ్జిని పరిశీలించామన్నారు..పరిశీలించిన వారిలో ఎంపీ ఓ శ్రీనివాస్, మంతిని గ్రామపంచాయతీ సెక్రటరీ భార్గవిలు ఉన్నారు.
- Advertisement -