- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలో జరిగిన ఉట్టి కొట్టే ఉత్సవాల్లో విషాదం జరిగింది. శనివారం మన్ఖుర్ద్లో ఉట్టి కొట్టేందుకు పిరమిడ్ కడుతుండగా అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల వ్యక్తి మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల కామెర్లు నుంచి కోలుకున్న 14 ఏళ్ల బాలుడు పిరమిడ్ నిర్మాణం పక్కనున్న టెంపోలో కూర్చొని అపస్మారక స్థితిలో పడిపోయాడని ఓ అధికారి తెలిపారు. పిరమిడ్ ప్రమాదంలో చౌదరి (32) కిందపడి మరణించాడని తెలిపారు.
- Advertisement -