- Advertisement -
– మున్సిపాల్టీ పరిధిలో 82 కార్యాలయ భవనాలు గుర్తింపు
– కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ వినియోగం తో సాదారణ విద్యుత్ వినియోగం తగ్గింపు,విద్యుత్ వ్యయం తగ్గించాలనే యోచన చేయడంతో అధికారులు ప్రభుత్వ కార్యాలయాలు సర్వే పూర్తి చేసారు. అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవనాలను సర్వే చేసి మొత్తం 82 భవనాలు ను గుర్తించినట్లు కమీషనర్ నాగరాజు బుధవారం తెలిపారు.ఈ గుర్తించిన భవనాలు పై వైశాల్యం,ప్రస్తుత విద్యుత్ వినియోగ సామర్ధ్యం తో కూడిన వివరాలను నమోదు చేసి నివేదికను విద్యుత్ శాఖకు అందజేస్తామని అయన తెలిపారు.
- Advertisement -