Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునీటి కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారుల మృతి

నీటి కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారుల మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో ఉన్న కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా నీరు చేరింది. ఈ క్రమంలో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ప్రమాదం విషయం తెలిపాడు. ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad