- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి(D) రామగిరి(M) సెంటినరీ కాలనీ టీ2-185 క్వార్టర్లో నివసిస్తున్న వేముల విజయ, రవిశంకర్ దంపతుల చిన్న కుమారుడు వసంత్ కుమార్(27) వోల్వో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి నష్టపోవడంతో తండ్రి మందలించి రూ.4 లక్షల వరకు అప్పు తీర్చాడు. వసంత్ మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్కు చేయగా నష్టాలు రావడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
- Advertisement -