Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలకు నివాళి: ఉపరాష్ట్రపతి

స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలకు నివాళి: ఉపరాష్ట్రపతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అండమాన్, నికోబార్ దీవుల సందర్శన, సెల్యులార్ జైలు, క్విట్ ఇండియా ఉద్యమం, తిరుప్పూర్ కుమరన్ వంటి చారిత్రక ఘట్టాలను గుర్తుచేసుకున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళి అర్పిస్తూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అజ్ఞాత వీరులను వెలుగులోకి తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ చొరవను ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -