- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు బ్రిటన్లో జరిగే పారిశ్రామికవేత్తల సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఈ అధికారిక పర్యటనలో ఆయన తన భార్య సంగీత, కుమార్తె దివ్యలను కలవనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, నటి త్రిష కూడా అదే సమయంలో యూరప్లో షూటింగ్ నిమిత్తం ఉండటంతో వారిద్దరి కలయికపై కూడా చర్చ జరుగుతోంది.
- Advertisement -



