Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్సమంత, నాగచైతన్య విడాకులపై... చైతూ మేనత్త కీలక వ్యాఖ్యలు

సమంత, నాగచైతన్య విడాకులపై… చైతూ మేనత్త కీలక వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్ : టాలీవుడ్ మాజీ దంపతులు సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. వీరిద్దరూ విడిపోయి చాలా కాలం గడుస్తున్నా… అసలు కారణాలపై వస్తున్న ఊహాగానాలకు ఇప్పటికీ తెరపడలేదు. ఇలాంటి తరుణంలో, నాగచైతన్య మేనత్త నాగ సుశీల ఈ అంశంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ సుశీల… చైతూ-సమంతల బంధంపై స్పందించారు. వారి పెళ్లి, విడాకుల విషయంలో కుటుంబం వైఖరి ఎలా ఉందో ఆమె స్పష్టం చేశారు. “సమంత, చైతూ పెళ్లి చేసుకుంటామని మమ్మల్ని అడిగినప్పుడు మేము వద్దనలేదు. ఆ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుని, విడాకులు తీసుకుంటామని చెప్పినప్పుడూ మేము అడ్డు చెప్పలేదు. మేము వారిని నిందించలేదు, ఆ నిర్ణయాన్ని పూర్తిగా వాళ్లకే వదిలేశాం” అని నాగ సుశీల వివరించారు.

‘ఏ మాయ చేశావే’ సినిమాతో దగ్గరైన నాగచైతన్య, సమంత చాలా సంవత్సరాల ప్రేమ తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరి బంధం నాలుగేళ్లకే ముగిసింది. 2021లో తాము విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వారి విడాకులపై ఎన్నో రకాల వదంతులు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇద్దరూ ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad