Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వినాయక మండపాల దగ్గర  సీసీ కెమెరాలు ఉండాలి: ఎస్ఐ

వినాయక మండపాల దగ్గర  సీసీ కెమెరాలు ఉండాలి: ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా 27 తారీకు నుండి ప్రారంభం కాబోతున్న వినాయక చవితి పండుగ  సందర్భంగా వినాయక చవితి మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని పసర ఎస్ ఐ అచ్చ కమలాకర్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ మీడియాతో మాట్లాడుతూ .. మండలంలో ప్రతి గ్రామంలో వినాయక మండపాల దగ్గర  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండపాల దగ్గర ఎలాంటి మత ఘర్షణలు గాని అల్లర్లు గాని జరగకుండా ప్రత్యేకమైన శ్రద్ధ మండపాలు నిర్వహించే వ్యక్తులే చూసుకోవాలని అన్నారు. పెద్దపెద్ద  స్పీకర్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది గురి చేయరాదని, ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి పండగ జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  మండల వినాయక చవితి మండపాలను నిర్వహించే వ్యక్తులకు ఉత్సవ కమిటీలకు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad