– ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల పనుల్లో వేగం పెంచండి
– శాటిలైట్ టౌన్షిప్లు.. పారిశ్రామిక పార్కులకు అనుగుణంగా ఉండాలి : సమీక్షలో సీఎం రేవంత్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే యాభై ఏండ్ల అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటికి సంబంధించిన జంక్షన్లు, అనుసంధానం ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ (సౌత్), రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణంపై హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ (సౌత్)కు సంబంధించిన అలైన్మెంట్ను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. అటవీ ప్రాంతం, జల వనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అలైన్మెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని హెచ్చరించారు. శాటిలైట్ టౌన్షిప్లు… పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లకు రూపకల్పన చేయాలని సీఎం అన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణ ప్రక్రిియను వేగవంతం చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఆర్ఆర్ఆర్ వెలుపలికి వెళ్లే ప్రాంతంలో తగు రీతిలో ట్రంపెట్స్ను నిర్మించాలనీ, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా, ట్రాఫిక్ సిగల్స్ లేకుండా దాటేలా చూడాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్.. నూతన అలైన్మెంట్కు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మంచిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ అలైన్మెంట్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించాలని సూచించారు. ఈ నూతన రహదారులకు సంబంధించి జాతీయ రహదారుల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యాభై ఏండ్లకు తగ్గట్టుగా అలైన్మెంట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES