- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసి కాళ్లు, చేతులు కట్టేసి, పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన బాసిత్(21) మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయినట్లు తల్లి సబియా ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పలువురు తన కొడుకును హత్య చేశారని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో మేడారం సమీప అడవుల్లో శుక్రవారం బాసిత్ మృతదేహం లభించింది.
- Advertisement -