Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ సేవలందించిన విద్యుత్ సిబ్బందికి సన్మానం

ఉత్తమ సేవలందించిన విద్యుత్ సిబ్బందికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
వరద పరిస్థితులు, గణేశ్ విసర్జన విధుల్లో తమ అంకితభావం, ధైర్యం, నిస్వార్థ సేవను అందించిన కామారెడ్డి టౌన్–3 విద్యుత్ శాఖ సిబ్బందిని అధికారులు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బందికి అభినందనలతో పాటు గుర్తుగా సన్మాన చిహ్నాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఇ, రామలక్ష్మి , ఏ డి ఈ కిరణ్ చైతన్య  లు  పాల్గొని సిబ్బందిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ  సంక్షోభ సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో చూపిన కృషి అమూల్యం అన్నారు. ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే ఈ సిబ్బందిని అభినందించడం మా గర్వకారణం  అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -