- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎస్జిఏప్ఐ ఆటల పోటీల్లో భాగంగా మండలంలోని దుబ్బపేట గ్రామ పరిధిలో గల కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థునిలు ఖోఖో, కబడ్డీ ఆటల పోటీల్లో డివిజన్ స్థాయిలో గెలుపొందారు. జిల్లా స్థాయిలో ఆడేందుకు ఎంపికైనట్లుగా పాఠశాల ప్రత్యేక అధికారి జి.భవాని శనివారం తెలిపారు. ఖోఖోలో వైష్ణవి, శ్రావణి, వెన్నెల, శ్రీచందన, కబడ్డీలో వర్శిత, మహేశ్వరి, లక్ష్మీ ఎంపికైయ్యారు. వీరిని ప్రత్యేక అధికారితో పాటు ఉపాధ్యాయురాళ్లు అభినందించారు.
- Advertisement -