- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. దసరా పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. కార్మికులు, సిబ్బందికి దసరా సందర్భంగా పండుగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి వెంటనే సప్లిమెంటరీ పే బిల్లులు తయారు చేసి చెల్లింపు చేయాలని సూచించారు. ఈ అడ్వాన్స్ను 2025 నవంబర్ జీతం నుంచి ప్రారంభమయ్యేలా పది సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -