- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా నర్సంపల్లిలో సినీ స్టైల్లో నవవధువు కిడ్నాప్ కలకలం రేపింది. కుమార్తె ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన అమ్మాయి బంధువులు పెళ్లికొడుకు ఇంటిపై దాడి చేశారు. కారులో వచ్చి వధువును ఇంట్లో నుండి లాకెళ్లారు. తమ కుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటనపై కేసు నమోదు చేసిన కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -