- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ను క్లిక్ చేయడంతో కాటోనిగడ్డ తండాకు చెందిన నానునాయక్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 2.30 లక్షలు కట్ అయ్యాయి. బుధవారం వాట్సాప్ గ్రూప్లో వచ్చిన లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. వెంటనే బ్యాంక్కు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఖాతాను ఫ్రీజ్ చేశారు. అనంతరం మిడ్జిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -